బాప్‌రే! దేశంలో ఇన్ని రేప్‌లా.. స్వయంగా కేంద్రమే చెప్పింది!

  • దేశంలో అడ్డూఅదుపు లేకుండా పోతున్న అత్యాచారాలు
  • మూడేళ్లలో లక్షకుపైగా కేసులు
  • కఠిన చర్యల కోసం బిల్లు సిద్ధం చేస్తున్నట్టు చెప్పిన మంత్రి
దేశంలో అత్యాచారాలకు అంతూపొంతూ లేకుండా పోతోందని స్వయంగా కేంద్రమే వెల్లడించింది. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజుజు సమాధానం ఇస్తూ దేశ్యాప్తంగా 2014-16 మధ్య ఏకంగా 1,10,333 అత్యాచార కేసులు నమోదైనట్లు సభకు తెలిపారు. 2014లో 36,375 కేసులు, 2015లో 34,561 కేసులు, 2016లో 38,947 కేసులు నమోదైనట్లు వివరించారు.

ఈ విషయంలో ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి మాట్లాడుతూ, నిందితులను కఠినంగా శిక్షించనున్నట్టు తెలిపారు. రేప్ కేసుల్లో దోషులుగా తేలిన వారికి కఠిన శిక్షలు విధించేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందన్నారు. 12 ఏళ్లు, ఆ లోపు వయసున్న బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణశిక్ష విధించాలన్న ప్రతిపాదన ఉన్నట్టు తెలిపారు. ప్రతిపాదిత బిల్లు త్వరలోనే లోక్‌సభ ముందుకు రానున్నట్టు వివరించారు.  
Go Back to Shorts
Kiran rijuju
Rape case
India
Lok Sabha
Rajya Sabha

More Telugu News